కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజున మంచి కార్యాలు చేపట్టాలి. ఇతరులకు దానం చెయ్యడం, భగవదారాధన చేయడం శుభఫలితాలనిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దైవపూజ చెయ్యని దేహం ప్రాణంలేని శరీరానికి సమానం. దైవ సంబంధం లేని వృధా మాటలు నక్కల ఊళలకు సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.
అందుచేత కొత్త సంవత్సరం పుట్టుకను వేడుకగా జరుపుకోవడంతో పాటు భగవదారాధన చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా సత్ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న జనవరి ఒకటో తేదీన పరిశుభ్రమైన నీరు, కుంకుమపువ్వు, పచ్చ కర్పూరం కలిపి దానితో మీకు ఇష్ట దైవమైన భగవంతునికి అభిషేకం చెయ్యడం ఉత్తమం.
ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరకురసం, కొబ్బరిబొండాంనీరు, చందనం వంటి వాటితోనూ అభిషేకం చేయించవచ్చు. అభిషేకం తర్వాత పూజకు పువ్వులతో అర్చన చేయించాలి. అలాగే ఇళ్లళ్లో అన్నం, పళ్లు, కొబ్బరికాయ నివేదనం చేసి తాంబులం, కర్పూర నీరాజనం చెయ్యాలి.
ఆలయాల్లో అభిషేకం, పూజలు పూర్తయ్యాక ఆలయాన్ని మూడుసార్లు ప్రదక్షిణం చెయ్యడం, ఆ దేవుడితి సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు గానం చేయాలి. అనంతరం మీకు వీలైనంత ఇతరులక
|
|
ఈ సంవత్సరం మే నెల వరకూ బృహస్పతి మీనం నందు ఆ తదుపరి అంతా మేషం నందు జూన్ 6వ తేదీ వరకూ ధనస్సు నందు రాహువు, మిధునము నందు కేతువు, ఆ తదుపరి అంతా వృశ్చికము నందు రాహువు, వృషభము నందు కేతువు, నవంబరు 15వ తేదీ వరకు కన్య యందు శని, ఆ తదుపరి అంతా తుల యందు సంచరిస్తారు.
ఈ గ్రహ సంచారాన్ని గమనించగా ప్రజలలో నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిత్యావసర వస్తు ధరలు గణనీయంగా పెరుగగలవు. రాజకీయ సంక్షోభం అధికం కాగలదు. ప్రజలలో పరస్పర అవగాహనా లోపం, విభేదాలు వంటివి అధికమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు గురుమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యములు చేయరాదు. ప్రాంతీయ తత్వాలు అధికమవుతాయి.
ప్రజలలో హింసాత్మక ధోరణి అధికం కాగలదు. మే 4వ తేదీ నుంచి డొల్లు కత్తెర ప్రారంభం. మే 29 వరకూ నిజకత్తెర ఉన్నందువల్ల శంకుస్థాపన గృహప్రవేశాదులు చేయరాదు. మే 8వ తేదీ నుంచి బృహస్పతి మేషం నందు సంచరించడం వల్ల వాతావరణం మార్పు ప్రజలకు ఎందో ఆందోళన కలిగిస్తుంది. గంగానదీ పుష్కరాలు ప్రారంభం కాగలవు. ఈ ఏడాది ఎండలు త్వరతగతిన ప్రారంభమవుతాయి. స్త్రీ బలవంత మరణాలు అధికం కాగలవు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశాజనకంగా ఉం
|